వైయస్ జగన్మోహన్ రెడ్డికి హైకమాండ్ పిలువు?
ఈ నెల 21, 22, 23 తేదీల్లో అందుబాటులో ఉండాలని పార్టీ అధిష్టానం జగన్ కు కబురు పంపినట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం పరిశీలించే అవకాశాలున్నట్లు తొలుత భావించారు. ఈ నెల 22వ తేదీననే మహారాష్ట్రతో పాటు మూడు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. రాష్ట్రంలో జగన్ వ్యవహారం పార్టీకి నష్టం కలిగించే అవకాశాలున్న నేపథ్యంలో పరిష్కారానికి కాంగ్రెసు హైకమాండ్ తొందరపడుతున్నట్లు చెబుతున్నారు.
Comments
Story first published: Monday, October 19, 2009, 12:29 [IST]