హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ చేరిన వైయస్ జగన్మోహన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ సోమవారం ఉదయం హైదరాబాదుకు చేరుకున్నారు. ఆయన కర్నాటక రాజధాని బెంగుళూర్ నుంచి హైదరాబాదుకు వచ్చారు. హైదరాబాదుకు వచ్చిన వెంటనే ఆయన దక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామిరెడ్డిని పరామర్శించారు. దీపావళి పర్వదినం సందర్భంగా వెంకట్రామిరెడ్డి టపాసులు పేలుస్తూ గాయపడిన విషయం తెలిసిందే.

జగన్ హైదరాబాద్ రాకతో రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడే అవకాశం ఉంది. జగన్ అనుకూల, వ్యతిరేక వర్గాలు కాంగ్రెసు పార్టీలో ఇప్పటికే దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రెండు శిబిరాలు రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలతో కాలం గడుపుతున్నాయి. జగన్ రాజశేఖర రెడ్డి ఉన్న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోనే ఉంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X