హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరద ప్రాంతాలకు కేంద్ర బృందం: ధర్మాన

By Pratap
|
Google Oneindia TeluguNews

Dharmana Prasada Rao
హైదరాబాద్: వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటనకు కేంద్ర బృందాలు రాష్ట్రానికి రానున్నాయి. నాలుగు రోజుల పాటు ఆ బృందాలు వరద, కరవు ప్రాంతాల్లో పర్యటిస్తాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. కేంద్రం నుంచి రూ.11,609 కోట్ల సాయాన్ని కోరినట్లు ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో ఎనిమిది మంది సభ్యులతో కూడిన కేంద్ర బృందం రాష్ట్రంలోని వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటిస్తుందని ఆయన చెప్పారు.

వరద జిల్లాలో పర్యటించే కేంద్ర బృందానికి సంయుక్త కార్యదర్శి దీప్తీ విలాస్ నేతృత్వం వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 24 నుంచి 27వ తేదీన వరకు కరువు ప్రాంతాల్లో పర్యటించే కేంద్ర బృందానికి కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి ఉపమ చౌదరి నాయకత్వం వహిస్తారని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X