కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ను పిలువలేదు: అభిషేక్ సింఘ్వీ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను తాము ఢిల్లీకి పిలువ లేదని కాంగ్రెసు అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ చెప్పారు. తాము ఢిల్లీకి ఆహ్వానించినట్లు జగనో, అధిష్టానమో చెప్తే నమ్మాలని ఆయన సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మూడు రాష్టాల ఎన్నికల తర్వాత జగన్ ను ఢిల్లీకి పిలిచి మాట్లాడుతామని తాము ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు. ఎన్నికలకు, జగన్ ను పిలిచేందుకు ఎటువంటి సంబంధమూ లేదని ఆయన అన్నారు. జగన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందంటూ చెలరేగిన ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు.

వైయస్ రాజశేఖర రెడ్డి మృతి వెనక హత్య దాగి ఉందంటూ ఒక పత్రికలో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఓ సీనియర్ నాయకుడి విషాదాంత మరణంపై ఊహాగానాలు, వదంతులు, చౌకబారు రాజకీయాలు, సంచలనాత్మక కథనాలు సరి కావని ఆయన హితవు పలికారు. దుర్ఘటనపై విచారణ జరిగిందని, నివేదిక కూడా వచ్చిందని, అది సరైన సమయంలో సరైన మార్గంలో వెల్లడవుతుందని ఆయన అన్నారు. మూడు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రుల ఎంపికకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపికకు సంబంధం లేదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X