విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే సోదరుడి కోసం గాలింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: కాంగ్రెసు నాయకుడు వీరయ్య హత్య కేసులో పోలీసులు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట తెలుగుదేశం శాసనసభ్యుడు శ్రీరాం తాతయ్య సోదరుడు ధనంజయ్ కోసం గాలిస్తున్నారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబ్ పేట గ్రామంలో కాంగ్రెసు నాయకుడు గింజుపల్లి వీరయ్య సోమవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకేసులో ధనంజయ్ తో పాటు మరో పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరాంతాతయ్య ఇంట్లో నందిగామ డీఎస్పీ మంగళవారం సోదాలు నిర్వహించారు.

శ్రీరాంతాతయ్య సోదరుడు ధనంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, శాసనసభ్యుడి సోదరుడిపై పెట్టిన కేసును ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మంగళవారం ఉదయం గౌరవరం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నవాబుపేట గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X