బాబు ఎదుట టిడిపి లుకలుకలు

పార్టీని ముందుకు నడిపించడానికి చురుగ్గా ముందుకు కదలాలని చంద్రబాబు నాయకులకు పిలువునిచ్చారు. తమ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెసు ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆయన ఆరోపించారు. తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఆర్థికంగా దెబ్బ తీసే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయని ఆయన విమర్శించారు. పార్టీకి జవజీవాలు సమకూర్చాలని ఆయన పార్టీ నాయకులను కోరారు. తెలుగు మహిళ అధ్యక్ష పదవిని ఆశించిన నన్నపనేని రాజకుమారి కూడా సమావేశానికి రాలేదు. ఆమె పార్టీ నాయకత్వంపై గతంలో తీవ్ర విమర్శలు కూడా చేశారు.












Click it and Unblock the Notifications