వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెవిపి తప్పుకోవాల్సిందే: మధు యాష్కీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhu Yashky
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహా సలహా సంఘం చైర్మన్, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావును లక్ష్యం చేసుకున్నారు. వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదానికి బాధ్యత వహించి కెవిపి రామచందర్ రావు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రమాదానికి బాధ్యులను చేసి డిజిపిని, నిఘా విభాగం అధిపతిని బదిలీ చేసినప్పుడు దానికి ఉన్నత పదవుల్లో ఉన్నవారు బాధ్యత ఎందుకు వహించబోరని ఆయన అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత భద్రతా సలహా సంఘం చైర్మన్ పదవిని డిజిపి, ఇంటలిజెన్స్ ఐజిపైన నియమించారని, అటువంటప్పుడు ఆయన ఎందుకు నైతిక బాధ్యత వహించరని వైయస్ ను కోల్పోయినవారందరి మనస్సుల్లో ఉందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

హెలికాప్టర్ ప్రమాదంలో కుట్ర దాగి ఉందని ఓ పత్రికలో వార్త వచ్చిందని,దీనికి హోం మంత్రి బాధ్యత వహిస్తారా అని ఆయన అన్నారు. భద్రతా సలహాదారు చైర్మన్ గా కెవిపి రామచందర్ రావును ఎందుకు నియమించారో తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నియామకంపై కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీదే నిర్ణయాధికారమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని సిఎల్పీ ఎన్నుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రోశయ్యనే పూర్తి స్థాయి ముఖ్యమంత్రి అని ఆయన అన్నారు. తెలంగాణ నినాదం ఎప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X