వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ను హైకమాండ్ చేతిలో పెట్టండి: యాష్కీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhu Yaskhi
న్యూఢిల్లీ: వైయస్ జగన్ భవిష్యత్తును పార్టీ అధిష్టానానికి వదిలేయాలని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ గౌడ్ ఆయన వర్గీయులకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారంపై అధిష్టానాన్ని కమాండ్ చేసే విధంగా ఎవరూ మాట్లాడవద్దని ఆయన సూచించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి రాష్ట్ర భద్రతా సలహా సంఘం చైర్మన్ కెవిపి రామచందర్ రావు బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ప్రమాదానికి బాధ్యత వహించి కెవిపి రాజీనామా చేయాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు.

సంపన్నశ్రేణి జీవోను ఉపసంహరించుకోవాలని ఆయన ముఖ్యమంత్రి కె.రోశయ్యను కోరారు. ఉద్యమం ఉధృతం కాక ముందే జీవోను ఉపసంహరించుకోవడం మంచిదని ఆయన అన్నారు. అవసరమైతే రాజ్యాంగ సవరణ తేవాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో రూ.4 లక్షల వార్షిక ఆదాయం దాటిన వారిని సంపన్నశ్రేణి (క్రీమీలేయర్)గా పరిగణించి ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు వర్తింప చేయకూడదంటూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X