హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మా నేతలను వదిలిస్తేనే..: కిషన్ జీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Maoists
హైదరాబాద్: పోలీసులు అరెస్టు చేసిన తమ నేతలను వదిలేస్తేనే తమ చెరలో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులను విడిచి పెడ్తామని మావోయిస్టు పశ్చిమ బెంగాల్ నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ చెప్పారు. ఆయన బుధవారం ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ తో ఫోన్ లో మాట్లాడారు. మావోయిస్టులు మంగళవారంనాడు పశ్చిమ బెంగాల్ లోని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఝార్ గ్రామ్ సబ్ డివిజన్ లోని పోలీసు స్టేషన్ పై దాడి చేసి సెకండ్ అధికారి దివాకర్ భట్టాచార్యను కాల్చి చంపారు. మరో ఇద్దరు పోలీసు అధికారులు అతీంద్రనాథ్ దత్తా, స్వపన్ రాయ్ లను కిడ్నాప్ చేశారు.

తాము పోలీసు అధికారులను చంపబోమని కిషన్ జీ చెప్పారు. కాగా, కిడ్నాప్ నకు గురైన పోలీసు అధికారుల కుటుంబ సభ్యులు బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్యను కలిశారు. పోలీసు అధికారులను విడిపిస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X