హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసు వసతి గృహాలకు రూ. 5 కోట్లు: సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: పోలీసు వసతి గృహాలకు వచ్చే బడ్జెట్ లో 5 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. హైదరాబాదులోని గోషామహల్ వద్ద జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ సభలో రోశయ్య ఈ హామీ ఇచ్చారు. పోలీసు వసతి గృహాలకు 10 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించాలని డిజిపి గిరీష్ కుమార్ కోరారు. అయితే ఐదు కోట్ల రూపాయలు కేటాయిస్తామని రోశయ్య హామీ ఇచ్చారు. పోలీసు జీవితం త్యాగాలమయమని ఆయన అన్నారు. పోలీసు ఉద్యోగంలో చేరే ప్రతి ఒక్కరూ ఆత్మస్థయిర్యంతో పనిచేస్తున్నారని ఆయన అన్నారు. అంతర్గత భద్రతను కట్టుదిట్టం చేసేందుకు పోలీసు వ్యవస్థ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులను అందరం స్మరించకోవాలని ముఖ్యమంత్రి అన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర పోలీసులు చేస్తున్న కృషిని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశంసించారు. మన రాష్ట్ర పోలీసుల సామర్థ్యాన్ని, ప్రతిభను చూసి ఇతర రాష్ట్రాల పోలీసులు నేర్చుకుంటున్నారని ఆమె అన్నారు. రాష్ట్ర పోలీసులకు ఇచ్చే శిక్షణాపద్ధతులను కూడా ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని ఆమె చెప్పారు. మరో మూడేళ్లలో 37 వేల మంది సిబ్బందిని నియమిస్తామని డిజిపి గిరీష్ కుమార్ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X