వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
50 గంటల తర్వాత ఇల్లు చేరిన దత్తా
రాష్ట్ర పోలీసు శాఖ కమెండోలు వెంట రాగా దత్తా శుక్రవారం తెల్లవారు జామున రెండున్నర గంటల ప్రాంతంలో ఆయన తన ఇంటికి చేరుకున్నారు. తల్లి, భార్య, కూతురు, బావ మరదులు, బంధువులు ఆయన రాకకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రమాదమేదీ తలపెట్టకుండా మావోయిస్టులు దత్తాను లాల్ ఘడ్ క్షేత్రంలో జర్నలిస్టులకు అప్పగించారు. తన ఇంటికి చేరుకోవడానికి ముందు దత్తా సమీపంలోని ఝాగ్రామ్ పోలీసు స్టేషనులో రిపోర్టు చేశారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సంఘటనపై వివరించడానికి ఆయన శుక్రవారం సాయంత్రం రాష్ట్ర పోలీసు నిఘా విభాగం అధికారులను కలుసుకుంటారు.
Comments
Story first published: Friday, October 23, 2009, 11:07 [IST]