వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన

By Pratap
|
Google Oneindia TeluguNews

Pakistan
పూంఛ్: పాకిస్తానీ బలగాలు మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించాయి. పూంఛ్ జిల్లాలోని మేంధార్ సెక్టార్ లోని భారత పోస్టుపై పాకిస్తాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో భారత జవాను గాయపడ్డాడు.పాకిస్తాన్ బలగాలు ఎల్ఎంజి, ఎంఎంజిలను మేంధార్ సెక్టారులోని క్రిపాన్ పోస్టుపై కాల్పులు జరిపాయని భారత రక్షణ వర్గాలు చెప్పాయి. పాక్ బలగాలు శనివారం ఉదయం తొమ్మిదిన్నర, పదిన్నర గంటల మధ్య 500 రౌండ్లు కాల్పులు జరిపాయి.

భారత బలగాలు ఎదురు కాల్పులు జరపలేదు. పాకిస్తాన్ నుంచి పదిన్నర గంటల తర్వాత కాల్పులు ఆగిపోయాయి. పాకిస్తాన్ కాల్పుల్లో గాయపడిన భారత జవాను ఓం బహదూర్ సింగ్ ను ఆస్పత్రికి తరలించారు. జమ్మూ డివిజన్ లోని కతురా అంతర్జాతీయ సరిహద్దు వద్ద అనుమానాస్పద కదలికలను గమనించి భారత బలగాలు కాల్పులు జరిపాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X