ఈ రోజు నుంచే భాష మార్చుకుంటా: కెసిఆర్
మౌలికాంశాలపై చర్చకు తాను సిద్ధమేనని కెసిఆర్ చెప్పారు. టీవీ 8 నాలుగు ప్రాంతాల మేధావులు, ప్రముఖులతో మౌలికాంశాలపై చర్చ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చింది. రెండో వారంలో గానీ, మూడో వారంలో గానీ ఈ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టీవీ 9 ప్రకటించింది. అన్ని ప్రాంతాలకు చెందిన మేధావులను, నిపుణులను ఈ చర్చా కార్యక్రమానికి ఆహ్వానించాలని కెసిఆర్ సూచించారు. కెసిఆర్ పై ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే తాను ఖండిస్తానని ఆంధ్ర మేధావుల సంఘం నాయకుడు శ్రీనివాస్ అంగీకరించారు.
తాను ఏమీ అసభ్యంగా మాట్లాడడం లేదని, తమ ప్రాంత నానుడులనే వాడుతున్నానని కెసిఆర్ సోమవారం చెప్పారు. పదాలకు అర్థాలు కూడా ఇచ్చారు. ఆంధ్ర ప్రాంతంలో సాధారణంగా వాడే బుల్లి వంటి పదాలు తెలంగాణలో వాడితే ఎలా చూస్తారో కూడా ఆయన వివరించారు. ప్రాంతాలను బట్టి భాష స్వరూపం ఉంటుందని, తాను తన భాషలో మాట్లాడుతుంటే తిట్లుగా అభివర్ణిస్తున్నారని ఆయన అన్నారు.