వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోల చేతిలో రాజధాని రైలు డ్రైవర్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajdhani Exp
కోల్ కత్తా: భువనేశ్వర్ - న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు డ్రైవర్ ను, అసిస్టెంట్ డ్రైవరును మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా బంచ్ తాలాలో రాజధాని ఎక్స్ ప్రెస్ ను ఆపేసి వారిద్దరిని నక్సలైట్లు అపరించుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది. నక్సలైట్లు ఎర్ర జెండా ఊపి రైలును ఆపి లోకో పైలట్ ను, అతని అసిస్టెంట్ ను ఎత్తుకుపోయినట్లు సమాచారం.

అయితే, మావోయిస్టులు చంపేస్తారనే భయంతో రైలును ఆపేసి డ్రైవర్ పారిపోయినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సంఘటనతో తమకు ఏ విధమైన సంబంధం లేదని మావోయిస్టు నేత కిషన్ జీ జీ న్యూస్ చానెల్ తో చెప్పారు. రైల్వై రక్షణ దళం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X