వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై ఎయిర్ పోర్టు మంగళవారం మూత

By Pratap
|
Google Oneindia TeluguNews

Mumbai Airport
ముంబై: ముంబై విమానాశ్రయంలో మంగళవారం ఉదయం 11, 12 గంటల మధ్య విమానాలు ఎక్కాలంటే ప్రయాణికులు 75 నిమిషాలు ముందుగా రావాల్సిందే. వచ్చే 22 మంగళవారాలు ఆరు గంటల పాటు విమానాశ్రయాన్ని పూర్తిగా మూసేస్తున్నారు. రెండు రన్ వేల మధ్య ఇంటర్ సెక్షన్లను మూసేస్తున్నారు. ఈ సమయంలో కేవలం విమానాలు ఉండవని కాదు. అయితే ఈ సమయంలో బయలుదేరే, వచ్చే విమానాల వేళల్లో ఏ మాత్రం జాప్యం జరగకూడదు. ఒకవేళ జాప్యం జరిగితే వాటిని ఇతర విమానాశ్రయాలకు మళ్లిస్తారు.

ఈ స్థితిలో చివరి నిమిషం ఇబ్బందులు పడడానికి బదులు ఒక గంట ముందుగా విమానాశ్రయానికి రావాల్సి ఉంటుంది. తనిఖీల్లో జాప్యం జరగకుండా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ప్రైవేట్ లిమిటెడ్ చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులు ఏ మాత్రం జాప్యం చేసినా ఇబ్బందుల పాలవుతారు. మరో విమానాన్ని పట్టుకోవాలంటే ఆరు గంటలు నిరీక్షించాల్సి వస్తుంది. సెకండరీ రన్ వేను పునర్నిర్మాణానికి ఇప్పటికే మూసేశామని, మంగళవారం మరో విమానాన్ని అనుతించే అవకాశం ఉండదని విమానాశ్రయాధికారులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X