వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్సీపి సమావేశానికి అజిత్ పవార్ డుమ్మా
మంత్రి పదవుల పంపకంపై కాంగ్రెసుతో ఎన్సీపి చర్చలు ఢిల్లీలో జరుగుతాయి. ఎన్సీపి అధినేత శరద్ పవార్ ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, రక్షణ మంత్రి ఎకె ఆంటోనీతో సమావేశమవుతారు. మంత్రి పదవుల పంపకం 1999లో మాదిరిగానే జరగాలని ఎన్సిపి అభిప్రాయపడుతోంది. హోం, ఆర్థిక, విద్యుచ్ఛక్తి శాఖలను కాంగ్రెసుకు ఇవ్వడానికి ఎన్సిపి నిరాకరిస్తోంది. ముఖ్యమంత్రి పదవిని తిరిగి చేపట్టనున్న అశోక్ చవాన్, రాష్ట్ర కాంగ్రెసు చీఫ్ మాణిక్ రావు థాకరే, ముంబై శాఖ అధ్యక్షుడు కృపాశంకర్ సింగ్ న్యూఢిల్లీ చేరుకున్నారు.
Story first published: Wednesday, October 28, 2009, 11:47 [IST]