వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్సీపి సమావేశానికి అజిత్ పవార్ డుమ్మా

By Pratap
|
Google Oneindia TeluguNews

Ajit Pawar
ముంబై: మంత్రి పదవుల శాఖలపై చర్చ కోసం ఏర్పాటైన ఎన్సిపీ సమావేశానికి ఆ పార్టీ నాయకుడు, శాసనసభ్యుడు అజిత్ పవార్ గైర్హాజరయ్యారు. ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. అయితే ఛగన్ భుజబల్ కే తిరిగి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించడంతో ఆయన అలిగినట్లు భావిస్తున్నారు. కాంగ్రెసు పార్టీతో పంచుకునే మంత్రి పదవులపై చర్చకు పౌర విమాన యానాల మంత్రి ప్రపుల్ పటేల్ నివాసంలో ఎన్సీపి నేతలు బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజబల్, పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ ఆర్ పాటిల్, తదితరులు హాజరయ్యారు.

మంత్రి పదవుల పంపకంపై కాంగ్రెసుతో ఎన్సీపి చర్చలు ఢిల్లీలో జరుగుతాయి. ఎన్సీపి అధినేత శరద్ పవార్ ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, రక్షణ మంత్రి ఎకె ఆంటోనీతో సమావేశమవుతారు. మంత్రి పదవుల పంపకం 1999లో మాదిరిగానే జరగాలని ఎన్సిపి అభిప్రాయపడుతోంది. హోం, ఆర్థిక, విద్యుచ్ఛక్తి శాఖలను కాంగ్రెసుకు ఇవ్వడానికి ఎన్సిపి నిరాకరిస్తోంది. ముఖ్యమంత్రి పదవిని తిరిగి చేపట్టనున్న అశోక్ చవాన్, రాష్ట్ర కాంగ్రెసు చీఫ్ మాణిక్ రావు థాకరే, ముంబై శాఖ అధ్యక్షుడు కృపాశంకర్ సింగ్ న్యూఢిల్లీ చేరుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X