వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాబూల్ దాడిలో 9 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kabul
కాబూల్: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ బుధవారం ఉదయం పేలుళ్లు, కాల్పులతో అట్టుడికింది. ఈ దాడిలో మొత్తం 9 మంది మరణించారు. ముగ్గురు మిలిటెంట్లను కాల్చి చంపడం ద్వారా భద్రతా బలగాలు ఐక్యరాజ్య సమితి అతిథి గృహాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. తాలిబన్ మిలిటెంట్లకు భద్రతా బలగాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు అధికారులు మరణించారు. కాబూల్ లోని ఐక్య రాజ్యసమితి అతిథి గృహం లోపలి నుంచి కాల్పులకు, పేలుళ్లకు సంబంధించిన శబ్దాలు వినిపించాయి.

నలుగురైదుగురు తాలిబన్ మిలిటెంట్లు యుఎన్ బంగళాలోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు, భవంతికి చెందిన ఓ భాగాన్ని పేల్చి వేశారని తెలుస్తోంది. ఆటోమేటిక్ ఆయుధాల కాల్పుల శబ్దాలు బుధవారం ఉదయం ఆరున్నర గంటల నుంచే వినిపించడం మొదలు పెట్టాయి. అంతర్జాతీయ బలగాలు, అఫ్గాన్ పోలీసు బలగాలు భవనాన్ని చుట్టుముట్టాయి. ఎదురుకాల్పుల్లో మరణించిన మిలిటెంట్లు ఎవరనేది చెప్పడానికి అధికారులు నిరాకరిస్తున్నారు.యుఎన్ అతిథి గృహంపై దాడి చేసింది తామేనని తాలిబన్ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ చెప్పుకున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X