హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదుకు కర్నాటక రాజకీయాలు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Yeddyurappa
హైదరాబాద్: కర్నాటక రాజకీయాలు హైదరాబాద్ కు మారుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కర్నాటక బిజెపిలో రాజకీయ సంక్షోభం తీవ్రమవుతోంది. గాలి సోదరులపై పట్టు బిగించేందుకు ముఖ్యమంత్రి యెడ్యూరప్ప ప్రయత్నిస్తున్నారు. మంత్రులు గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి, శ్రీరాములుకు సన్నిహితులైన అధికారులను యెడ్యూరప్ప మార్చివేశారు. యెడ్యూరప్పను మార్చబోమని బిజెపి అధిష్టానం కూడా ప్రకటించింది. యెడ్యూరప్ప గురువారం అత్యవసరంగా శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి దాదాపు 50 మంది శాసనసభ్యులు హాజరయ్యారు.

పార్టీ అధిష్టానం ఒత్తిడి తెస్తున్నప్పుటికీ దిగి రావడానికి గాలి సోదరులు నిరాకరిస్తున్నారు. అయితే పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో హైదరాబాదులో క్యాంపు ఏర్పాటు చేసేందుకు గాలి సోదరులు సన్నాహాలు చేసుకున్నట్లు సమాచారం. గాలి సోదరులు ఇప్పటికే ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ బయలుదేరినట్లు చెబుతున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా శాసనసభ్యులు తమ నుంచి జారిపోకుండా హైదరాబాదులో క్యాంపు నిర్వహించాలని గాలి సోదరులు భావించినట్లు చెబుతున్నారు. గాలి సోదరులకు అండగా ఉన్న 18 మంది శాసనసభ్యులను హైదరాబాదు శివారులోని ఓ రిస్టార్ లో ఉంచినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

కాగా, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు, కడప కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయమే బెంగుళూర్ బయలుదేరి వెళ్లారు. ఆయన బెంగుళూర్ వెళ్లడంలో మతలబేమైనా ఉందనే విషయంపై కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే జగన్ ప్రధాన కేంద్రం చాలా కాలంగా బెంగుళూరే కావడం వల్ల అందులో ప్రత్యేకతేమీ లేదని అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X