హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొండా సురేఖపై టిడిపి నేతల ధ్వజం

By Pratap
|
Google Oneindia TeluguNews

Nannapaneni Rajakumari
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై చేసిన వ్యాఖ్యలకు గాను మంత్రి పదవికి రాజీనామా చేసిన కొండా సురేఖపై తెలుగుదేశం నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని, కమ్మ లాబీ అడ్డుపడుతోందని ఆమె చేసిన ఆరోపణలపై వారు తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబును తప్పు పట్టినందుకు, కమ్మ లాబీ కమ్మకులం అన్నందుకు కొండా సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నన్నపనేని రాజకుమారి కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కు, ముఖ్యమంత్రి కె. రోశయ్యకు విజ్ఞప్తి చేశారు. అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకునే సత్తా లేక తమపై సురేఖ విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు. తమపైనే కాకుండా కమ్యూనిస్టులపై కూడా సురేఖ విమర్శలు చేయడం సరి కాదని ఆమె అన్నారు. ఏ కమ్మ నాయకుడు, ఏ కమ్మ లాబీ జగన్ ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపతున్నారో చెప్పాలని ఆమె సురేఖను డిమాండ్ చేశారు.

సురేఖ వ్యాఖ్యలు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉన్నాయని తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకునే సత్తా లేక సురేఖ తమపై, తమ నాయకుడు చంద్రబాబుపై సురేఖ విమర్శలు చేస్తున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. సురేఖ భగవంతుడ్ని ఒక్కడ్నే వదిలేశారని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ ను ఎన్నుకునే బలం లేక సురేఖ తమపై మండిపడుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఎవరైనా తమకేమీ అవసరం లేదని, ప్రజాసమస్యలపై పోరాటమే తమకు ముఖ్యమని మరో తెలుగుదేశం నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. కాంగ్రెసు పార్టీలో యాజమాన్య హక్కుల కోసం పోరాటం జరుగుతోందని మరో తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత కాంగ్రెసును ఇడుపులపాయ కాంగ్రెసుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X