వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ బాటలోనే నేనూ: రోశయ్య

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వైఎస్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. వైఎస్‌ లేరన్న చేదునిజం నుంచి తేరుకోకముందే రాష్ట్రంలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి ఐదు జిల్లాలకు తీవ్రనష్టం చేయడం విచారకరమన్నారు.

వరదల సమయంలో అధికారయంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని ఆయన కితాబునిచ్చారు. వరదలతో తీవ్రంగా నష్టపోయిన కర్నూలు, మహబూబ్‌నగర్‌ నల్గొండ, కృష్ణా,గుంటూరు జిల్లాలను ఆదుకుంటామన్నారు. నిర్వాసితులకు సాయం అందించమని విజ్ఞప్తి చేస్తే దాతలు దాదాపు రూ. వందకోట్లకు పైగా విరాళాలివ్వడం వారి విశాలహృదయానికి దర్పణంగా నిలుస్తుందన్నారు. రైతుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. రైతు బాగుంటేనే గ్రామాలు పచ్చగా ఉంటాయని దేశమూ సుభిక్షంగా ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X