వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ను సిఎం చేసే వరకు పోరు: మురళి

By Pratap
|
Google Oneindia TeluguNews

Konda Surekha
వరంగల్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసే వరకు విశ్రమించబోమని కాంగ్రెసు ఎమ్మెల్సీ, మాజీ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి అన్నారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన పావురాలగుట్టకు బయలుదేరే ముందు ఆయన సోమవారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వరంగల్ జిల్లాకు చెందిన భారీ నీటి పారుదల మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. వైయస్సార్ కు తాను లక్ష్మణుడినని పొన్నాలు చెప్పుకున్నారని, వైయస్సార్ మృతి తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆయన అన్నారు. పొన్నాల లక్ష్మయ్య రాజకీయ అవకాశవాది అని ఆయన విమర్శించారు.

జలయజ్ఞంలో వేల కోట్ల రూపాయలు సంపాదించిన పొన్నాల అవినీతిైప సిబిఐతో విచారణ జరిపించాలని పార్టీ అధినేత సోనియా గాంధీని కోరుతానని ఆయన చెప్పారు. పొన్నాల అవినీతి వల్లనే జలయజ్ఞం నీరు గారిందని ఆయన నిందించారు. జలయజ్ఞాన్ని పొన్నాల ధనయజ్ఞంగా మార్చారని ఆయన అన్నారు. ఎస్సార్ఎస్పీ, దేవాదుల ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యతా లోపం వల్ల ఒక్క ఎకరానికి కూడా నీరు అందడం లేదని ఆయన అన్నారు. వరంగల్ లోని వైయస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి ఆయన పావురాల గుట్టకు బయలుదేరారు. కొండా దంపతుల వెంట పావురాలగుట్టకు కార్యకర్తలు కూడా బయలుదేరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X