హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుట్టలో తొక్కిసలాట: స్పృహ తప్పిన ఇద్దరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Yadagirigutta
హైదరాబాద్: నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో సోమవారం తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు స్పృహ తప్పారు. వారిని ఆస్పత్రికి తరలించారు. ఆలయంలోని సత్యనారాయణస్వామి వ్రతాల హాల్లో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. కార్తీక పౌర్ణమి, సోమవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవాలయం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. క్యూలైన్లో ఇక్కడ కూడా స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. క్యూలైన్లు, వ్రత మంటపాలు క్రిక్కిరిసిపోయాయి. అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X