చిరుతో పొత్తు ప్రస్తుతానికి లేదు: మొయిలీ

కాగా, ప్రజారాజ్యం పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య సోమవారం సాయంత్రం హైదరాబాదులోని సచివాలయంలో ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిశారు. తాము పొత్తుపై తుది నిర్ణయం తీసుకోలేదని ప్రజారాజ్యం పార్టీ మరో నేత కోటగిరి విద్యాధర రావు చెప్పారు. అయితే తాము పొత్తుకు ఆసక్తితో ఉన్నామని ఆయన చెప్పారు. పొత్తుపై విమర్సలు కాంగ్రెసు పార్టీ అంతర్గత వ్యవహారమని ఆయన అన్నారు.
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఇమేజ్ తో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని ఇమేజ్ ను పోల్చలేమని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజయవాడలో అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఒంటరిగా పోటీ చేసి 125 స్థానాల్లో గెలుస్తుందని, మేయర్ పదవిని కైవసం చేసుకుంటుందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications