వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గవర్నర్ జమీర్ తో అశోక్ చవాన్ భేటీ
ప్రభుత్వ ఏర్పాటు ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజబల్ తో కూడా జమీర్ విడిగా సమావేశమైనట్లు రాజభవన్ వర్గాలు చెప్పాయి. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 22వ తేదీన వెలువడ్డాయి. ఇప్పటి వరకు కాంగ్రెసు, ఎన్సీపిల మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. హోం, ఆర్థిక, ఇంధనం వంటి ప్రధాన శాఖల కోసం ఎన్సీపి పట్టుబడుతోంది. అయితే కొన్ని ప్రధాన శాఖలను ఎన్సీపికి ఇవ్వడానికి కాంగ్రెసు వ్యతిరేకిస్తోంది. దీంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. తాము అడిగిన మంత్రి పదవులు, శాఖలు ఇవ్వకపోతే కాంగ్రెసుకు వెలుపలి నుంచి మద్దతిస్తామని భుజబల్ చెబుతున్నారు.
Comments
Story first published: Tuesday, November 3, 2009, 17:48 [IST]