వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారై వ్యాపారుల న్యాయపోరాటం సఫలం

By Santaram
|
Google Oneindia TeluguNews

Nigeria
అబుజా: తమపై విధించిన దేశ బహిష్కారాన్ని సవాల్‌ చేస్తూ నైజీరియాలో ముగ్గురు ప్రవాస భారతీయ సోదరులు చేసిన న్యాయపోరాటం ఫలించింది. వారిపై విధించిన దేశ బహిష్కారాన్ని ఫెడరల్‌ కోర్టు కొట్టివేసింది. బ్రిటన్‌కు చెందిన భారత సంతతి వ్యాపారవేత్తలు సునీల్‌ వాశ్వానీ, హరీష్‌ వాశ్వానీ, మహేష్‌ వాశ్వానీలను గత సంవత్సరం ఏప్రిల్‌లో నైజీరియా బహిష్కరించింది. వారు నడుపుతున్న స్టాలియన్‌ గ్రూపుపై అవినీతి ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకుంది. అంతేకాకుండా వారి కంపెనీకి సీల్‌వేసి ఉద్యోగులను వెనక్కు పంపించివేసింది. వీరిలో అత్యధికులు భారతీయులు.

నైజీరియా ప్రభుత్వ చర్యను వాశ్వానీ సోదరులు కోర్టులో సవాల్‌ చేశారు. కేసును విచారించిన ఫెడరల్‌ న్యాయస్థానం వారిపై విధించిన దేశ బహిష్కారాన్ని రద్దు చేసింది. అంతేకాకుండా వారి సంస్థ నుంచి వెళ్లగొట్టిన ఉద్యోగులను తిరిగి నియమించుకోవ చ్చని కోర్టు తీర్పు వెలువరించింది. పక్షపాత వైఖరితో ప్రభుత్వం వాశ్వానీ సోదరులను బహిష్కరించిందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కోర్టు తీర్పుపై స్టాలియన్‌ గ్రూపు హర్షం వ్యక్తం చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X