వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రాణం బలిగొన్న కామం, తండాలో దారుణం

By Santaram
|
Google Oneindia TeluguNews

Warangal
వరంగల్: అక్రమ సంబంధం మరో ప్రాణాన్ని బలిగొంది. ప్రియుని మోజులో భర్తను హతమార్చిన ఓ గృహిణి, చివరకు ప్రియుని చేతిలోనే హత్యకు గురైంది. డబ్బు కోసం చోటుచేసుకున్న గొడవ చివరకు ఆమె ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ సంఘటనలో ఆమె ముగ్గురు కుమార్తెలు అనాధలుగా మిగిలిపోయారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలంలోని జల్లి గ్రామానికి చెందిన గిరిజన వివాహిత హేమ్లి(35)కి కొర్ర మోహన్‌ తో వివాహేతర సంబంధం వుండేది. ఈ క్రమంలో ఆమె మోహన్‌, అతని అనుచరులతో కలిసి 2008 జనవరి 12న భర్త బిక్షంను హతమార్చింది. అనంతరం హేమ్లి, మోహన్‌ కలిసి జీవించడం ప్రారంభించారు. హేమ్లికి అప్పటికే ముగ్గురు కుమార్తెలు వున్నారు.

వారి భవిష్యత్తు కోసం హేమ్లి తల్లిదండ్రులు ఒక్కొక్కరి పేరుమీద రూ.40వేల చొప్పున ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. అయితే ఈ డబ్బులపై కన్నేసిన మోహన్‌ వాటిని విడిపించుకురావాలని హేమ్లిమీద గత నాలుగురోజులుగా హింసిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మోహన్‌ గొడవ పెట్టుకొని హేమ్లిని విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్రగాయాలకు లోనై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే ఆమెను బంధువులు చికిత్స కోసం ఎంజి ఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్సపొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. హేమ్లీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హేమ్లీ మృతికి కారకుడైన మోహన్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X