వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ హెలికాప్టర్ ప్రమాద నివేదిక అలస్యం

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తుండగా, ప్రమాదానికి గురైన భెల్‌-430లోని కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌కు సంబంధించిన నివేదిక ఇంకా రాలేదని సీబీఐ డీఐజీ లక్ష్మీనారాయణ తెలిపారు. మారోమారు పావురాలగుట్టను బెంగళూరుకు చెందిన ప్రత్యేక నిపుణులతో కలిసి సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. మరిన్ని ఆధారాలను సేకరించి విశ్లేషించాల్సిన అవసరం ఉందని, అందుకే ఈ ఘటనపై విచారణ ఆలస్యమయ్యే అవకాశం ఉందని లక్ష్మీనారాయణ తెలిపారు.

వైయస్ హెలికాప్టర్ ప్రమాదంపై అనేక వివాదాలు ముసురుకున్న విషయం తెలిసిందే. ఆ హెలికాప్టర్ ప్రమాదం విద్రోహ చర్య అన్న వదంతి ప్రచారంలో ఉంది. అయితే బ్లాక్ బాక్స్ వివరాలు ఇదివరకే పత్రికలకు పొక్కాయి. ప్రమాదం జరిగే సమయంలో వైయస్ కొద్దిగా కునుకు తీస్తున్నట్టు తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X