కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ను పిసిసి అధ్యక్షుడిని చేయాలి: మారెప్ప

By Santaram
|
Google Oneindia TeluguNews

Mareppa
కర్నూలు: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గట్టెక్కాలంటే పీసీసీ చీఫ్‌గా వైఎస్‌ జగన్‌ను ప్రకటించాలని మాజీ మంత్రి మారెప్ప డిమాండ్‌ చేశారు. ఆయన శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ తన నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్సీ, జడ్పీటీసీలను గెలిపించుకోలేకపోగా, ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన డీ. శ్రీనివాస్‌ను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్నారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 33 సంవత్సరాల వయసులో పీసీసీ చీఫ్‌గా నియమితులై కాంగ్రెస్‌కు అనేక విజయాలను అందించారని చెప్పారు.

ఇప్పుడు పార్టీ మనుగడ కోసం జగన్‌ను పీసీసీ చీఫ్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో డివిజన్ల టికెట్లు రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు అమ్ముకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయని, ఇది కాంగ్రెస్‌కు తీరని కళంకమన్నారు. నిజాయితీ గల నాయకులు ఉన్నత స్థానంలో ఉంటే క్రమశిక్షణ దానంతట అదే వస్తుందని చెప్పారు. వార్డు మెంబర్లుగా పనికిరానివారు నామినేటెడ్‌ పోస్టులు దక్కించుకుని అతిగా ప్రవర్తిస్తున్నారని కొందరు సీనియర్‌ నాయకులనుద్దేశించి వ్యాఖ్యానించారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన సమర్థులను ఎంపిక చేయడంలో అధిష్ఠానం విఫలమైందనిన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X