రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వృద్ధ దంపతులను హత్య చేసిన గిరిజన యువకుడు

By Santaram
|
Google Oneindia TeluguNews

East Godavari
రాజమండ్రి: ఒక గిరిజన యువకుడు వృద్ధ దంపతులను నరికి చంపాడు. మామ ఇచ్చిన రూ.ఐదు వేలు ఏం చేశావని అడిగినందుకు ఓ గిరిజన యువకుడు తాతను, అమ్మమ్మను నరికి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం.. రాజవొమ్మంగి మండలం శరభవరం పం చాయతీ అప్పన్నపాలెం గ్రామంలో పెద్దిపాలెం మండలం బవుకూరుకు చెందిన చెదల కొండబాబు అలియాస్‌ సింహా చలం, అప్పన్నపాలెం గ్రామానికి చెందిన సత్యవతితో ప్రేమవ్యవహారం నడిపాడు. మూడో నెల గర్భవతిగా ఉన్న సమయం లో ఆరు నెలల క్రితం వివాహమాడాడు.

ప్రస్తుతం తొమ్మిదో నెల రావడంతో భార్యను ఇటీవలే అప్పన్నపాలెంలోని పుట్టింటికి పంపాడు. నెల రోజుల క్రితం ఆమెను చూడడానికి వచ్చిన సింహాచలానికి మామ పప్పుల పెద్దబ్బాయి రూ. ఐదు వేలు ఇచ్చాడు. గర్భవతి అయిన కుమార్తె టీవీ చూడడానికి చుట్టుపక్కల వాళ్ల ఇళ్లకు వెళ్తూండటం ఇష్టం లేక, టీవీ కొని తెమ్మని ఈ నగదు ఇచ్చాడు. అయితే, సింహాచలం దానిని సొంతానికి వినియోగించుకున్నాడు. శనివారం తిరిగి భార్యను చూడడానికి అప్పన్నపాలెం వచ్చాడు.

ఆ సమయంలో భార్య సత్యవతి తన పుట్టింటి సమీపంలోనే ఉన్న తాత, నాయనమ్మల ఇంట్లో ఉంది. అక్కడికి వెళ్లిన సింహాచలాన్ని సత్యవతి తాత నూకరాజు, నాయనమ్మ అప్పాయమ్మ ఆ డబ్బు కోసం ఆరా తీశారు. దీంతో కోపోద్రిక్తుడైన అతడు శనివారం మధ్యాహ్నం నుంచీ ఆ వృద్ధులతో ఘర్షణ పడడం ప్రారంభించాడు. అత్తమామలు కాకుండా ఆ వృద్ధులు నగదు కోసం ఆరా తీయడంపై మనస్తాపం చెందాడు. దీనిపై రాత్రి కూడా వాగ్వాదం జరగడంతో సహించలేని సింహాచలం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న వేటకత్తితో ఆ వృద్ధులిద్దరిని మెడపై నరికి చంపాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X