వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపి సిఎం శివరాజ్ కు తప్పిన ముప్పు

By Pratap
|
Google Oneindia TeluguNews

Shivraj Singh Chauhan
గ్వాలియర్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గవర్నర్ సిఎం ఠాకూర్ మంగళవారం విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వారు ప్రయాణిస్తున్న విమానం దిగుతున్న సమయంలో కార్లను ఢీకొట్టే ప్రమాదం నుంచి చివరి నిమిషంలో తప్పించుకుంది. విజయ్ రాజే సింధియా ఎయిర్ టెర్మినల్ రన్ వేపైకి అకస్మాత్తుగా రెండు కార్లు వచ్చాయి. అదే సమయంలో రన్ వేపై దిగుతున్న విమానం తృటిలో వాటిని ఢీకొట్టే ముప్పు నుంచి తప్పించుకుంది.

ఈ సంఘటన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రయాణిస్తున్న విమానం దిగడానికి కొద్ది ముందుగానే సంభవించింది. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం పైలట్లు కార్లను కనిపెట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా విమానాన్ని పైకి లేపారు. దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ తర్వాత విమానం దిగడానికి ముందు పది నిమిషాల పాటు గాలిలో చక్కర్లు కొట్టింది. ఆ రెండు కార్లు కూడా వైమానిక దళానికి చెందినవని తెలుస్తోంది. వైమానిక దళానికి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు మధ్య సమన్వయ లోపమే దీనికి కారణమని భావిస్తున్నారు. సంఘటనపై ముఖ్యమంత్రి చౌహాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X