వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రికార్డుల తరలింపును అడ్డుకున్న తెరాస

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
మెదక్: మెదక్ జిల్లా పాపన్నపేట లక్ష్మీనగర్ భూముల రికార్డులను తహిశీల్దార్ కార్యాలయం నుంచి తరలించడానికి సిబ్బంది విఫల యత్నం చేశారు. అసైన్డ్ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారనే ఆరోపణతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టడంతో అధికారులు ఆ రికార్డులను ఆటోలో కార్యాలయం వెనక నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి ప్రయత్నించారు. ఈ విషయం కనిపెట్టిన తెరాస నాయకులు అడ్డుకున్నారు.

తెరాస నాయకులు రికార్డుల తరలింపును అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రికార్డులను తారుమారు చేయడానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారని తెరాస నాయకులు ఆరోపించారు. ఈ సమయంలో పోలీసులు, ఆర్డీవో జోక్యం చేసుకుని రికార్డులను తిరిగి కార్యాలయంలో పెట్టించారు. కాగా, పాపన్నపేటకు తరలి వస్తున్న తెరాస కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. స్థానిక తెలుగుదేశం శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు తెరాస కార్యకర్తల ఆందోళనను వ్యతిరేకిస్తున్నారు.తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు లక్ష్మీనగర్ కు వస్తే తరిమి కొడతామని ఆయన హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X