ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rangareddy
హైదరాబాద్: రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఆర్టీసి బస్సు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో పది గాయపడ్డారు. ఈ ప్రమాదం బుధవారం ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలోని యాచారం సమీపంలో జరిగింది. ఆర్టీసి బస్సు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి హైదరాబాదుకు వస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరమ్మతుల కోసం లారీని డ్రైవర్ రోడ్డు పక్కన ఆపాడని, దాన్ని ఒంగోలు నుంచి వస్తున్న ఆర్టీసి బస్సు ఢీకొట్టిందని వారు చెప్పారు. మరణించినవారిని శ్రీనివాస్, వలురమ్మ, సరస్వతి, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. గాయపడిన పది మందిలో 65 ఏళ్ల నారాయణమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతులు ప్రకాశం జిల్లా గుండేముల్ గ్రామానికి చెందినవారు. తీవ్రంగా గాయపడిన నారాయణమ్మది ఎడోమని గ్రామం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X