విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుడిలో రాసలీలలపై పోలీసు దర్యాప్తు ప్రారంభం

By Santaram
|
Google Oneindia TeluguNews

Krishna District
విజయవాడ: భక్తుల మనోభావాలను దెబ్బతీసిన విజయవాడ కనక దుర్గమ్మ గుడి ప్రాంగణంలో రాసలీలల ఉదంతంపై పోలీసు దర్యాప్తు ప్రారంభమింది. దుర్గగుడిలో ఈనెల 6న ఇద్దరు ఉద్యోగుల మధ్య జరిగిన రాసలీలల వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. ఇదే సమయంలో గుడిలో కొందరు ఉద్యోగులకు, అధికారులకు వివాహేతర సంబంధాలున్నాయని వచ్చిన లేఖపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు. వన్‌ టౌన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటరెడ్డి, సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ జయసూర్యలు బుధవారం ఉదయం ఇంద్రకీలాద్రికి చేరుకుని ఇన్‌ఛార్జి ఇవో గోపాలకృష్ణారెడ్డిని ఆయన ఛాంబర్‌లో కలిశారు.

ఏదో ఒక చిన్న సంఘటన పర్యవసానంగా మహిళా ఉద్యోగులందరినీ అవమానపరిచే విధంగా వ్యవహరించడం తగదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈనెల 6న జరిగిన రాసలీల సంఘటన వివరాలివి. ఆ రోజు దేవాదాయ కమిషనర్ సుందర్ కుమార్ ఆలయానికి వచ్చి అధికారులతో చర్చలు జరిపారు. ఈలోపు సందట్లో సడేమియాల్లాగా ఇద్దరు ఉద్యోగులు ఒక చిన్న హాలులో రాసలీల ప్రారంభించి సిసి కెమెరాలకు చిక్కిపోయారు. ఆ దృశ్యాన్ని తొలగించడంపై పోలీసులు ఆలయ ఈవోతో విభేదిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X