హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి ఎమ్మెల్యేల ధర్నా, అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం గనుల అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం శాసనసభ్యులు గురువారం హైదరాబాదులోని సచివాలయం వద్ద ధర్నా చేపట్టారు. ధర్నాకు దిగిన టిడిపి శాసనసభ్యులను పోలీసులు అరెస్టు చేసి గాంధీనగర్ పోలీసు స్టేషనుకు తరలించారు. ఈ సమయంలో సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి రోశయ్య దిగి రావాలంటూ తెలుగుదేశం శాసనసభ్యులు నినాదాలు చేశారు. స్వయంగా వచ్చి రోశయ్య తమ నుంచి వినతిపత్రం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్, కెవిపి రామచందర్ రావు ఒత్తిళ్లకు తలొగ్గి రోశయ్య త్రిసభ్య కమిటీ విచారణను తూతూ మంత్రంగా సాగిస్తున్నారని తెలుగుదేశం శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా విమర్శించారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి ఓబుళాపురం గనులకు సంబంధించిన రికార్డులను చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కొడాపై 75 బృందాలతో విచారణ జరిపిస్తున్న కేంద్రం లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిన ఓబుళాపురం గనుల కంపెనీ వ్యవహారాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X