హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మైనింగ్ మాఫియాకు వైయస్ వత్తాసు: నాగం

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: ఐదేళ్ల పాటు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మైనింగ్ మాఫియాకు వత్తాసు పలికారని తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలను వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సహించారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి అండదండలతోనే ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. మైనింగ్ డబ్బులతో గాలి జనార్దన్ రెడ్డి 50 మంది శాసనసభ్యులను కూడగట్టి యెడ్యూరప్ప ప్రభుత్వానికి సవాల్ విసిరారని ఆయన అన్నారు.

తమ మంత్రివర్గంలోని సభ్యుడు అక్రమ గనుల తవ్వకాలకు పాల్పడుతున్నారని అంటూ దానిపై చర్య తీసుకోవాలని కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కేంద్రానికి లేఖ రాశారని, అయితే గాలి జనార్దన్ రెడ్డిపై ఏ విధమైన చర్య తీసుకోలేదని ఆయన అన్నారు. బిజెపి కేంద్ర నాయకత్వం యెడ్యూరప్పకు మద్దతివ్వాల్సింది పోయి గాలి జనార్దన్ రెడ్డి షరతులకు తలొగ్గిందని ఆయన విమర్శించారు.బిజెపి కేంద్ర నాయకత్వం మైనింగ్ మాఫియాకే వత్తాసు పలికిందని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X