హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెవిపితో అల్లు భేటీ కాకతాళీయమే: కోటగిరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kotagiri Vidhyara Rao
హైదరాబాద్: కాంగ్రెసు నాయకులు కెవిపి రామచందర్ రావు, బొత్సా సత్యనారాయణలతో తమ పార్టీ నాయకుడు అల్లు అరవింద్ భేటీ కాకతాళీయమేనని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు కోటగిరి విద్యాధరరావు స్పష్టం చేశారు. వారు కాకతాళీయంగా మాత్రమే కలిశారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వారంతా హైదరాబాదులోని ఓ హోటల్ లో కాకతాళీయంగా కలవడాన్ని ఆసరాగా తీసుకుని ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమవుతుందంటూ ప్రచారం సాగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రైవేట్ బ్యాంకుకు సంబధించిన కార్యక్రమంలో వారంతా కలిశారని ఆయన చెప్పారు. వారి మధ్య రాజకీయ చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

ఆ కార్యక్రమానికి తెలుగుదేశం నేత అశ్వనీదత్ తో పాటు పలువురు ప్రముఖులు వచ్చారని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ అధినేత చిరంజీవి కాంగ్రెసుపై విమర్శలు చేస్తుంటే ఆ పార్టీతో విలీనం ఎలా సాధ్యమవుతుందని ఆయన అడిగారు. ఈ భేటీపై మంత్రి బొత్సా సత్యనారాయణ కూడా ప్రతిస్పందించారు. తమ భేటీకి ఏ విధమైన రాజకీయ ప్రాధాన్యం లేదని ఆయన శనివారం విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X