కర్నూల్
:
పంజాబ్
నేషనల్
బ్యాంక్లో
ఆదివారం
తెల్లవారుజామున
ప్రమాదావశాత్తు
అగ్నిప్రమాదం
సంభవించింది.
పెద్ద
ఎత్తున
మంటలు
చెలరేగడంతో
బ్యాంక్లోని
ఫర్నీచర్,
కంప్యూటర్లు,
ఏటీఎంలు
కాలి
బూడిదయ్యాయి.
ఈ
ప్రమాదంలో
సుమారు
రూ.
25
లక్షల
వరకు
ఆస్తి
నష్టం
జరిగిందని
తెలిసింది.
ఈ
రోజు
ఉదయం
5
గంటల
ప్రాంతంలో
బ్యాంక్
గదుల
నుంచి
పొగలు
రావడాన్ని
గమనించిన
స్థానికులు
అగ్నిమాపక
సిబ్బందికి
సమాచారం
అందించారు.
దీంతో
వారు
ఘటనా
స్థలానికి
చేరుకుని
మంటలను
అదుపు
చేశారు.
విద్యుత్
షార్ట్
సర్క్యూట్
వల్లే
ఈ
ప్రమాదం
జరిగిందని
పోలీసులు
భావిస్తున్నారు.