వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్కె తీర్చమంటూ ఎస్సై బలాత్కారం

By Srikanya
|
Google Oneindia TeluguNews

Kurnool
కర్నూలు: ఎస్సై తన కోర్కెను తీర్చాలంటూ బలవంతం చేశాడని రేష్మా,ఫరీదా అనే ఇద్దరు మహిళలు జిల్లా ఎస్పీ శ్రీకాంత్‌కు ఫిర్యాదు చేశారు.అంగీకరించకపోతే దొంగతనం కేసు బనాయిస్తానని సీఐ బెదిరించాడని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన సీఐ పీఎస్‌ బాబు తమపై అసభ్యంగా ప్రవర్తించాడని వారు తమ పిర్యాదులో పేర్కొన్నారు.

వారు చెప్పేదాని ప్రకారం నందికొట్కూరులోని మారుతీనగర్‌లో ఆ మహిళల ఇంటికి తనిఖీ వెళ్లిన సీఐ ఇంట్లో నిద్రిస్తున్న యువకున్ని పోలీసుస్టేషన్‌కు పంపించాడు. అనంతరం తన కోర్కెను తీర్చాలంటూ బలవంతం చేశాడు. అంగీకరించకపోతే దొంగతనం కేసు బనాయిస్తానని సీఐ బెదిరించాడు.మహిళల ఫిర్యాదును అందుకున్న ఎస్పీ శ్రీకాంత్‌ ఈ సంఘటనపై విచారణకు ఎఎస్పీ రవీంద్రనాయక్‌ను నందికొట్కూరుకు పంపించాడు. నేరంరుజువైతే సీఐపై కఠినచర్యలు తప్పవని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X