హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శవయాత్ర నిర్వహించిన జూడాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jr Doctors
హైదరాబాద్: తమ ఉపకార వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ జానియర్ వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం కూడా తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. పోస్టు కార్డులపై తమ డిమాండ్లను రాసి వారు రక్తంతో వేలిముద్రులు చేశారు. ఆ పోస్టు కార్డులను ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీలకు పంపుతున్నారు. సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రి వద్ద జూనియర్ డాక్టర్లు ప్రభుత్వం శవయాత్ర నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్షలు మూడో రోజు సోమవారం కూడా కొనసాగాయి. గాంధీ ఆస్పత్రి వద్ద సాగుతున్న దీక్షాశిబిరాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు నాయని నర్సింహారెడ్డి, పద్మారావు సందర్శించారు. జూనియర్ డాక్టర్ల సమ్మెను పరిష్కరించలేని ముగ్గురు వైద్య శాఖ మంత్రులు కూడా రాజీనామా చేయాలని నాయని నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు.

జూనియర్ డాక్టర్ల సమ్మెపై మానవ హక్కుల కమిషన్ ప్రతిస్పందించింది. విధి నిర్వహణకు ఆటంకం కలిగించేలా జూనియర్ డాక్టర్లు సమ్మె చేయరాదని కమిషన్ అభిప్రాయపడింది. సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని కమిషన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించింది. ఈ విషయంపై రేపటి లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడం దుష్ప్రవర్తన కిందికే వస్తుందని కమిషన్ అభిప్రాయపడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X