సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

29 నుంచి కెసిఆర్ ఆమరణ నిరశన దీక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు (కెసిఆర్) ఆమరణ నిరాహార దీక్ష చేపట్టే తేదీ ఖరారైంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. ఆయన ఈ నెల 29వ తేదీన మెదక్ జిల్లా సిద్ధిపేటలో తన నిరాహార దీక్షను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు దీక్షకు కూర్చుంటారు. రాష్ట్ర సాధన కోసం తాను నవంబర్ చివరి వారంలో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభిస్తానని కెసిఆర్ పదే పదే చెబుతున్న మాట తెలిసిందే.

కాగా, కాంగ్రెసు శాసనసభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డికి చెందిన మెదక్ జిల్లాలోని పాపన్నపేట లక్ష్మీనగర్ లోని 30 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని దళితులనకు తిరిగి అప్పగించాలని కెసిఆర్ ముఖ్యమంత్రి రోశయ్యను కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. సాయంత్రం కెసిఆర్ మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వివిధ తెలంగాణేతరులు వందలాది ఎకరాలు ఎలా స్వాధీనం చేసుకున్నదీ వివరించారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి బంధువులకు కూడా భూములున్నాయని ఆయన చెప్పారు. ఈ విధంగా స్థానికేతరులు తెలంగాణలో భూములు కలిగి ఉండడం పెద్ద మనుషుల ఒప్పందానికి విరుద్ధమని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X