వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లష్కరేకు నా తండ్రే నన్ను అమ్మాడు: కసబ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kasab
వాషింగ్టన్: డబ్పుల కోసం తన తండ్రి తనను లష్కరే తోయిబాకు విక్రయించాడని ముంబై దాడుల కేసు నిందితుడు అజ్మల్ అణీర్ కసబ్ చెప్పుకున్నాడు. టెర్రర్ ఇన్ ముంబై అనే పేరుతో హెచ్ బీఓలో కొత్త డాక్యుమెంటరీలో కసబ్ మాటల క్యాసెట్ ను చేర్చారు. కసబ్ కు, పాకిస్తాన్ లోని అతని నియంత్రణదారులకు మధ్య జరిగిన సెల్ ఫోన్ సంభాషణలను, కసబ్ తో పోలీసుల వీడియో ఫుటేజ్ ను ఈ డాక్యుమెంటరీలో చేర్చారు. ఇప్పటి వరకు అవి వెలుగులోకి రాలేదు. సిఎన్ఎన్ లో ప్రసారమైన ఈ డాక్యుమెంటరీకి ఫరీద్ జకారియా వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

తాను లష్కరేతో ఎలా వెళ్లిందీ ఒక టేప్ లో కసబ్ వెల్లడించాడు. మనకు డబ్బులు కావాలి, మనం ఇక ఎంత మాత్రం పేదలుగా ఉండకూడదు, నీ సోదరులకు, నీ సోదరీలకు పెళ్లిళ్లు జరగాలి, మంచి జీవితాన్ని అనుభవిస్తున్న వారిని చూడు, నువ్వు కూడా వారిలా ఉండగలవు అని తనకు తన తండ్రి చెప్పినట్లు కసబ్ వివరించాడు. వారు డబ్బులు తన తండ్రికిచ్చారని ప్రశ్నిస్తున్న వ్యక్తితో అతను చెప్పాడు. తనకు లష్కరే శిక్షణ ఇచ్చిన తీరును కూడా అతను వివరించాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X