హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గం: రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ఓబుళాపురం గనులకు సంబంధించి చర్యలు తీసుకునే విషయంలో ఎవరికీ తలొగ్గబోమని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. ఎవరినీ కాపాడే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను సరిగా స్పందించలేదనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శలను ఆయన ఖండించారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని, అందుకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ విషయంలో ప్రతిపక్షాల నేతలు ఆదివారంనాడు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ భేటీ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఓబుళాపురం వ్యవహారంలో వివిధ స్థాయిల్లో సమావేశాలు నిర్వహించామని, ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం కూలంకషంగా అధ్యయనం చేసి పారదర్శకంగా వ్యవహరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో అపోహలకు తావు లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా న్యాయబద్దంగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన పలు అంశాలను అవగతం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పూర్తిగా అధ్యయనం చేయకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X