హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రా రాజకీయాల్లో మైనింగ్ మాఫియా: కారత్

By Pratap
|
Google Oneindia TeluguNews

Prakash Karat
హైదరాబాద్: మైనింగ్ మాఫియా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా తాకిందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అన్నారు. కర్నాటక రాజకీయాలను కుదిపేసిన మైనింగ్ మాఫియా ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చుట్టుముట్టిందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తాను వివరాల్లో వెళ్లడం లేదని, ఏ పార్టీ అని కూడా చెప్పడం లేదని, అయితే ఇది ప్రమాదకరంగా పరిణమించిందని ఆయన అన్నారు. మైనింగ్ మాఫియాను బిజెపి కర్నాటక రాష్ట్రంలో ప్రోత్సహించడాన్ని ఆయన తప్పు పట్టారు.

మైనింగ్ మాఫియా ఇంత వరకు రాజకీయాల వెలుపల ఉండి తమ కార్యకపాలు సాగించేదని, ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించిందని, కర్నాటక బిజెపి రాజకీయాలు అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెసు నేత మమతా బెనర్జీ మావోయిస్టులతో కుమ్మక్కయ్యారని ఆయన విమర్శించారు. మావోయిస్టులు తమ కార్యకర్తలను విచ్చలవిడిగా హత్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్తలను హత్య చేస్తే ఎవరికి నష్టమో మావోయిస్టులు ఆలోచించాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X