విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహుల్ కోసం విజయవాడ ఎదురు చూపుల్

By Santaram
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
విజయవాడ: లయోలా విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం కోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ బుధవారం విజయవాడ రానున్నారు. దీంతో రాహుల్‌ పర్యటన కోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జెడ్‌ కేటగిరిలో ఉండడంతో ఆయన భద్రత కోసం అధికారులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమం కోసం లయోలా కళాశాల అడిటోరియం ముస్తాబు అవుతోంది.

లయోలా కళాశాల విద్యార్థులపాటు వివిధ కళాశాలల నుంచి గుర్తించిన విద్యార్థులకు రాహుల్‌తో ముచ్చటించే అవకాశం కలుగుతుంది. దీని కోసం ఆడిటోరియంలో రెండువేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నగరానికి చేరుకున్న ఎస్‌పీజీ సిబ్బంది, కలెక్టర్‌ పీయూష్‌కుమార్‌, పోలీసు కమిషనర్‌ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డితో కలసి లయోలా కళాశాల, సిద్థార్థా మెడికల్‌ కళాశాల మైదానాలను హెలీప్యాడ్‌ కోసం పరిశీలించారు. లయోలాలో చె ట్లు ఎక్కువగా ఉండటంతో సిద్థార్థ కళాశాలను ఎంపిక చేశారు. ఒకవేళ వర్షం పడితే గన్నవరంలోనే దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా నగరానికి వచ్చేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఉదయం ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు.

18వ తేదీ మెడికల్‌ కళాశాల గ్రౌండ్స్‌కు ఉదయం 10.25 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా లయోలా ఆడిటోరియంకు చేరుకుని విద్యార్థులతో గంటసేపు ముచ్చటిస్తారు. మరల హెలీప్యాడ్‌ చేరుకుని వరంగల్‌ వెళ్తారు. సోమవారం ఏర్పాట్లను సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పైలా సోమినాయుడు, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పసాని సందీప్‌, కాంగ్రెస్‌ నాయకులు కడియాల బుచ్చిబాబు, దేవినేని అవినాష్‌, పీ గౌతంరెడ్డి, ఎంపీ కార్యాలయం తరఫున సత్యప్రసాద్‌, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు సీబీఈడెన్‌, వంశీ, లయోల కళాశాల ఫాదర్లు పర్యవేక్షించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X