అయేషా కేసులో పోలీసుల సాక్ష్యాల నమోదు
ఈ కేసులో నిందితుడికి సంబంధించి ఆధారాలు లేవని అప్పటి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మొదట ప్రకటించారు. నందిగామ పోలీస్స్టేషన్ పరిధిలో అరెస్టు అయిన సత్యంబాబు ఇచ్చిన వాంగ్మూలంతో ఈ కేసులో అతడిని నిందితుడిగా అరెస్టు చేశారు. ఆయేషా కేసు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కోర్టు 28 సాక్షులను విచారించింది. దర్యాప్తు అధికారుల విచారణకు కేసు వాయిదాపడింది. సోమవారం ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో అప్పుడు ఎస్ఐ, సీఐలుగా పనిచేసిన వారిని కోర్టులో విచారించారు. మంగళవారం నందిగామ డీఎస్పీ ఎం శ్రీనివాసరావు, వెస్ట్ ఎసీపీ (అప్పటి) ఎల్ విజయ్కుమార్ల సాక్ష్యాలను కోర్టులో విచారణ చేపడతారు.
Comments
Story first published: Tuesday, November 17, 2009, 16:00 [IST]