హెడ్లీతో ఎమ్రాన్ హష్మీకి సంబంధాలు?
హెడ్లీతో హష్మీ ఫోన్ లో మాట్లాడినట్లు దర్యాప్తు సంస్థలు ఒక నిర్ధారణకు వచ్చినట్లు ఆ వార్తా కథనం తెలుపుతోంది. ఆ వార్తాకథనాన్ని బట్టి - రాహుల్ భట్ హష్మీకి హెడ్లీని పరిచయం చేశాడు. ఆ తర్వాత హష్మీ, హెడ్లీ రెండు సార్లు కలిశారు. హష్మీ నటించిన తుమ్ మిలె సెట్ లో వారిద్దరు కలిసినట్లు తెలుస్తోంది. వారిద్దరికి పరిచయం ఉన్న విషయాన్ని రాహుల్ భట్ దర్యాప్తు సంస్థలకు చెప్పినట్లు సమాచారం. హష్మీ మహేష్ భట్ సమీప బంధువు కూడా. రాహుల్ భట్ ను కేసులో సాక్షి చేర్చే అవకాశం ఉందని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
హెడ్లీని రాహుల్ భట్ కొంత మంది హీరోయిన్లకు కూడా పరిచయం చేసినట్లు చెబుతున్నారు. రాహుల్ భట్ ను ముంబై విడిచి వెళ్లకూడదని భారత జాతీయ దర్యాప్తు సంస్థ ఆదేశించింది. హెడ్లీ ముంబైలో ఉన్నప్పుడు కలిసినవారందరి వాంగ్మూలాలను కూడా సంస్థ రికార్డు చేస్తోంది. హెడ్లీ ముంబైలోని ఉన్న ఆపార్టుమెంటును కూడా అధికారులు కనిపెట్టారు.