హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పేరుకే ఓబుళాపురంపై సిబిఐ దర్యాప్తు: బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం అక్రమాలపై పేరుకు సిబిఐ దర్యాప్తు వేస్తే సరిపోదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తమ పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవిపై సిబిఐ దర్యాప్తు ఇంత వరకు పూర్తి కాలేదని, ఓబుళాపురంపై కూడా అలాగే దర్యాప్తు జరిగేలా ఉందని ఆయన అన్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ బుధవారం ఉదయం చంద్రబాబుతో భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య ఓబుళాపురంపై, పార్లమెంటు శీతాకాలం సమావేశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కారత్ భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఓబుళాపురం ద్వారా ప్రభుత్వ సంపద తరలిపోకుండా చర్యలు తీసుకుని సిబిఐ దర్యాప్తు ఆదేశించాలని తాము డిమాండ్ చేస్తూ వస్తున్నామని, అయితే ఆ చర్యలేవీ చేపట్టకుండా సిబిఐకి అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. ఓబుళాపురం అక్రమాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు.

ఓబుళాపురం గనుల లీజును రద్దు చేయాలని, మైనింగ్ కార్యకలాపాలను నిలిపేయాలని, అక్కడి ముడి ఇనుమును స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఓబుళాపురం గనులకు సంబంధించిన పత్రాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల ఆ ఫైళ్లను స్పీకర్ వద్ద పెట్టాలని డిమాండ్ చేశామని ఆయన చెప్పారు. సిబిఐ దర్యాప్తును వైయస్ జగన్ తో పాటు గాలి జనార్దన్ రెడ్డి కూడా ఆహ్వానించారని, అయితే ఓబుళాపురం మైనింగ్ కు సంబంధించిన డబ్బులు ఎక్కడికెళ్లాయనేది తేలాలని చంద్రబాబు ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. రాష్ట్ర సరిహద్దులు కూడా మార్చివేశారని, గ్రామాల సరిహద్దులు మార్చేశారని ఆయన ఆరోపించారు. ఇతర మైనింగ్ కంపెనీలను బెదిరించి తమలో కలిపేసుకున్నారని ఆయన ఆరోపించారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఓబుళాపురంపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X