హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'గాలి' తవ్వకాల నిలిపివేతకు హైకోర్టు 'నో'

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం గనుల తవ్వకాలు నిలిపేయాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు గురువారం కొట్టేసింది. ఓబుళాపురం గనుల్లో యధావిధిగా తవ్వకాలు కొనసాగించవచ్చునని హైకోర్టు తెలిపింది. గనుల తవ్వకాలు నిలిపేయాలంటూ డిఎఫ్వో కల్లోల్ బిశ్వాస్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసి) యాజమాన్యం హైకోర్టులో సవాల్ చేసింది.

ప్రభుత్వం జారీ చేసిన జీవోలు చూపిన కారణాలు సహేతుకంగా లేవని హైకోర్టు అభిప్రాయపడింది. అందువల్ల ఆ ఆదేశాలు చెల్లవని స్పష్టం చేసింది. ఓఎంసి ఆరున్నర హెక్టార్లలో అక్రమంగా తవ్వకాలు జరిపిందంటూ డిఎఫ్ఓ బిశ్వాస్ ఇచ్చిన నోటీసులను కూడా హైకోర్టు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X