ఎన్ ఎంయుతో యాదవ్ చర్చలు వాయిదా
కాగా, ఆర్టీసి కార్మికుల డిమాండ్లు న్యాయమైనవేనని ఆర్టీసి చైర్మన్ ఎం. సత్యనారాయణరావు అన్నారు. సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆయన కార్మికులకు సూచించారు. యూనియన్ నేతలతో తమ యాజమాన్యం చర్చలు జరుపుతోందని, ఆదాయం లేకపోవడం వల్ల సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని ఆయన కరీంనగర్ లో మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష గురించి విలేకరులు ప్రశ్నించగా తెలంగాణ ఉద్యమంలో అలాంటివి తాను ఎన్నో చేశానని ఆయన జవాబిచ్చారు.
Story first published: Thursday, November 19, 2009, 14:57 [IST]