వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెరుకు ధరపై దద్ధరిల్లిన పార్లమెంటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Farmers
న్యూఢిల్లీ: నూతన చక్కెర ధర విధానానికి వ్యతిరేకంగా గురువారం పార్లమెంటుతో పాటు ఢిల్లీ వీధులు దద్ధరిల్లాయి. ఈ విధానానికి వ్యతిరేకంగా బిజెపి, అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్ఎల్డీ సభ్యులు లోకసభ వెల్ లోకి దూసుకెళ్లి సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. శీతాకాలం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే లోకసభలో ఈ దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఆర్డినెన్స్ ను రద్దు చేసేవరకు సభా కార్యక్రమాలను సాగినివ్వబోమని బిజెపి అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. సభా కార్యక్రమాలు స్తంభించడంతో లోకసభ స్పీకర్ మీనా కుమార్ సభను వాయిదా వేశారు.

సభ వాయిదా పడిన తర్వాత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ శరద్ పవార్, వీరప్ప మొయిలీ, ప్రణబ్ ముఖర్జీ వంటి సీనియర్ మంత్రులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. పార్లమెంటులో ఆర్డినెన్స్ పై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని శరద్ పవార్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. చెరుకు రైతులకు ఎంత ధర చెల్లిస్తారనే విషయంపై వివాదం నెలకొంది. రైతులకు చెల్లించే చెరుకు ధరను పెంచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చెరుకు ధరను పెంచాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతులు జంతర్ మంతర్ లోని రామ్ లీలా మైదానంలో ప్రదర్శన నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X